28, ఆగస్టు 2016, ఆదివారం

నాలో నీలో ఓ చోటా నయీమ్

‘‘రాంగోపాల్ వర్మ నరుూమిజంపై మూడు సినిమాలు తీస్తారట! ఆయన కన్నా ముందే ప్రేక్షకులు నరుూమ్‌పై వర్మ సినిమా ఖాయం అనుకున్నారు. ’’
‘‘ప్రేక్షకులు మరీ రాటుతేలిపోయారు.’’


‘‘మూడు సినిమాలు తీసేంత నేరాలున్నాయా? ’’
‘‘నరుూమ్ పేరు వినగానే అలా అయిపోయావు. భయపడ్డావా?’’
‘‘నాకా భయమా? షష్టిపూర్తి వయసులో ఎన్టీఆర్.. అమ్మా నేను కాలేజీలో కంట్రీలోనే ఫస్ట్ వచ్చానమ్మా.. అంటూ నోట్ బుక్ పట్టుకుని ఇంటికి పరిగెత్తుకొచ్చి తన కన్నా చిన్న వయసులో ఉన్న అంజలీ దేవి ఒడిలో వాలిపోయే సినిమాలు చూస్తూ పెరిగిన శరీరంరా! ఇది. వయసులో ఉన్న చెల్లిలిని కౌగిలించుకుని ఉక్కిరిబిక్కిరి చేసే అన్నయ్యల సినిమాలు చూసి తట్టుకున్న తరం మాది. 60 ఏళ్ల హీరో 50 ఏళ్ల గుమ్మడిని తాతా అంటూ గారాలు పోతే చూసిన సం బర పడ్డ తరం మాది. ఏమండీ మీ పాదాల వద్ద నాకింత చోటిస్తే చాలండీ అనే డైలాగులను రసగుల్లాల అంత ఈజీగా జీర్ణం చేసుకుంటూ పెరిగి, హీరో ఉఫ్ అంటూ వంద మందిని గాలిలో ఎగిరేట్టు చేస్తున్న హీరోల సినిమాలను సంతోషంగా చూస్తున్నాం. అలాంటి నేను వర్మ సినిమాకు భయపడడమా?నెవర్’’
‘‘రక్త చరిత్ర అంటూ సినిమాల్లో హింసను విపరీతంగా ప్రేమించే వర్మ రక్తం అంటే వణికిపోతారట! తెలుసా?’’


‘‘విలువలు లేని నాయకులు విలువల గురించి ఎక్కువగా మాట్లాడినట్టు రక్తం అంటే భయపడే వర్మసినిమాల్లో రక్తం చిందిస్తాడన్నమాట! ’’
‘‘అది సరే పోయిన వారమే నరుూమ్ గురించి మాట్లాడుకున్నాం కదా? మళ్లీనా?’’
‘‘రక్తచరిత్ర అంటూ పరిటాలపై రెండు సినిమాలు తీసిన వర్మ, నరుూమ్‌పై మాత్రం మూడు సినిమాలు తీస్తానని చెప్పారు. మూడు సినిమాల కథ ఉన్నప్పుడు రెండు వారాలన్నా మాట్లాడుకోవాలి కదా? ’’
‘‘నిజంగా నరుూమ్ అంత క్రూరుడా?’’
‘‘మనలో మాట. నీలోనూ నాలోనూ ఎంతో కొంత నరుూమిజం ఉంటుంది?. 
నాలో నీలో ఓ చోటా నయీమ్ దాక్కొని ఉంటాడు . అవకాశాన్ని బట్టి బయటకు  వస్తాడు  ’’
‘‘పసిపిల్లలను కూడా దారుణంగా హత్య చేసిన వాడెక్కడ? చీమను చంపని నేనెక్కడ? ’’
‘‘హిట్లర్ కనీసం టీ, కాఫీలు కూడా తాగేవాడు కాదట! ఐతే నేం లక్షల మందిని చంపలేదా? చీమను చంపని వాడు మనిషిని చంపడనే గ్యారంటీ ఏమీ ఉండదు.’’
‘‘పవనిజం అంటేనే అర్ధం కాక తలపట్టుకుంటే కొత్తగా ఈ నరుూమిజమేంటో’’
‘‘ రాజకీయ భాషలో ఇజం అంటారు. మనుషుల భాషలో తిక్క. ఎవడి తిక్క వాడికో ఇజంలా కనిపిస్తుంది. అంతే.’’
‘‘పాలకుల్లో విష్ణు అంశ ఉంటుందని విన్నాను కానీ, ఇదేంటి నువ్వు ప్రతి ఒక్కడిలో నరుూమిజం ఉంటుందటావు?’’


‘‘నరుూమిజం అంటే క్రూరత్వం. పైశాచికత్వం. రాక్షస లక్షణాలు అన్నీ. చెల్లుబాటు అయితే ప్రతోడు తనలోని రాక్షసుడ్ని నిద్ర లేపి అధికారం చెలాయించాలని చూస్తాడు. మొన్న ఓ ఎస్‌ఐ తన పై అధికారులు కోరినంత లంచాలు వసూలు చేసి కప్పం కట్టడం తన వల్ల కాదని తూటా పేల్చుకుని ప్రాణాలు వదిలాడు. ఆ పై అధికారులు పోలీసులే కావచ్చు కానీ వారిలో ఉన్నది నరుూమిజమే కదా? ఒక్కోక్కరిలో ఒక్కో రూపంలో నరుూమిజం బయటపడుతుంది. ఎంఆర్‌ఓ ఆఫీసులో పని కోసం వెళితే ప్యూన్ తనలోని నరుూమ్ విశ్వరూపాన్ని చూపిస్తాడు. లోన్‌కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు మేనేజర్ తనలోని నరుూమిజాన్ని తట్టి లేపుతాడు. అదే మేనేజర్ ఇంటికి వెళ్లాక భార్య తనలోని నరుూమిజాన్ని అతని ముందు ప్రదర్శించవచ్చు. చిరుద్యోగి జీతం పెంచమనో, సెలవు కావాలనో బాస్ వద్దకు వెళ్లినప్పుడు మీరే మా దేవుడు అని వాళ్లు పైకి చెప్పినా మనసులో మాత్రం వీడే మనపాలిట నరుూమ్ అనుకుంటారు.’’


‘‘అంటే అంతా నరుూమ్‌లేనా?’’
‘‘ఒకందుకు నరుూమ్ ఇజాన్ని మెచ్చుకోవాలి. మనం చాలా గొప్పగా చెప్పుకునే మన వ్యవస్థలోని డొల్లతనం నరుూమిజం బయటపెట్టింది. దారి తప్పిన ఒక్కడు తలుచుకుంటే మొత్తం దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవచ్చునని, ఈదీ అమీన్‌ను చూపించవచ్చునని, కోట్లాది మందిని వణికించవచ్చునని నరుూమిజం నిరూపించింది.’’


‘‘అంటే నరుూమిజం సమాజానికి మేలు చేసిందటావా?’’
‘‘ఆ మాట నేనెప్పుడు అన్నాను ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలు, నరుూమ్‌ల తప్పులకు గొడుగు పడితే ఏమవుతుందో చెప్పాను అంతే. ఎన్‌కౌంటర్ జరిగి ఉండక పోతే దేశంలో సమాంతర పాలనా వ్యవస్థ దుబాయ్ నుంచి సాగేది. అంటే ప్రవాస భారతీయ ప్రభుత్వం దుబాయ్ కేంద్రంగా పని చేసి ఉండేది.’’
‘‘అంటే నరుూమిజంకు వ్యవస్థదే తప్పంటావా? ’’
‘‘ఆ మాట నేనెక్కడన్నాను. నరుూమ్‌లో ఒక క్రూరుడే కాదు ఒక పిరికి వాడు కూడా దాగున్నాడు. మనలోనూ అంతే నరుూమిజంతో పాటు అంతకు మించి పిరికి తనం ఉంటుంది.’’
‘‘నరుూమిజానికి పరిష్కారమే లేదా? ’’
‘‘రాంగోపాల్ వర్మను ఎంతగానో ప్రభావితం చేసిన నరుూమిజంలో పరిష్కారం ఏం చూపిస్తారో చూద్దాం’’
‘‘అంటే నరుూమిజం సమస్యకు వర్మ వద్దనే పరిష్కారం ఉందంటావు’’
‘‘నేను అనని మాటను నాకు అంటగడుతున్నావు. మనలోనే కాదు సినిమా వారిలోనూ ఒక్కొక్కరు ఒక నరుూమే కదా? నరుూమ్ దందాలు బయట పడ్డాయి. వీరివి పడలేదు అంతే’’
‘‘ నరుూమిజానికి పరిష్కారమే లేదా? ’’
‘‘ నరుూమిజానికి ఎరువు ఏమిటో తెలుసా? మనలోని పిరికితనం. నరుూమ్‌లు పిరికి తనం పెంచి పోషించేందుకు తమ తెలివి తేటలన్నీ ఉపయోగిస్తారు. వారికి పెట్టుబడి అదే. మనం ఎంత భయపడితే నరుూమిజం అంతగా వేళ్లు పాతుకు పోతుంది. హిట్లర్ ప్రపంచాన్ని గడగడలాడించినా, నరుూమ్ వేల ఎకరాలు, కోట్ల రూపాయలు సంపాదించినా, ఎంతో మందిని హతమార్చినా అతని ప్రధాన ఆయుధం మనుషుల్లోని పిరికి తనం.’’
‘‘ మన జీవితాలు  ఇంతేనా?’’
‘‘ప్రపంచాన్ని బాగు చేయాలనే ప్రయత్నాన్ని మన నుంచే మొదలు పెడదాం. మనలోని  చోటా నయీమ్ ను  ఎన్‌కౌంటర్ చేసి నిర్మూలిద్దాం. మన చుట్టూ ఎవరిలో  నయీమ్  కనిపించినా పిరికితనంతో సరెండర్ కాకుండా ఎదిరిద్దాం. సమాజాన్ని పీడిస్తున్న నరుూమిజానికి పరిష్కార మార్గం ఇదే’’

- బుద్ధా మురళి (జనాంతికం 28-8-2016)

21, ఆగస్టు 2016, ఆదివారం

బంగారు పతకం!

‘‘ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది? దిగులెందుకు?’’
‘‘సమస్య ఏమిటో తెలియకుండానే పరిష్కారం చూపడం మీ మేధావులకే చెల్లు’’
‘‘ స్నేహితుడివని పలకరిస్తే,మేధావి అని అంత పెద్ద తిట్టు న్యాయమా? ఇంతకూ నీ సమస్య చిరంజీవి 150వ సినిమా హిట్టవుతుందా? లేదా? అనేనా? ’’
‘‘చిరంజీవి అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చాక నేను కూడా రాజకీయాల గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. నా సమస్య సినిమా గురించి కాదు..’’


‘‘కాశ్మీర్ సమస్యనా? రెండు దేశాలకు ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే ఎంత సేపు. సమస్య అలా ఉండడమే ఈ సమస్యకు వారు కోరుకుంటున్న పరిష్కారం. మీరు కాశ్మీర్‌లో వేలుపెడితే, మేం బెలుచిస్తాన్‌లో కాలు పెడతాం అని మోదీ గట్టిగానే సమాధానం ఇచ్చారు కదా? ’’
‘‘పౌరాణిక సినిమాల్లో హీరో విలన్ ఇద్దరూ బాణాలతో సిద్ధంగా నిలబడి పద్యాలు పాడుకున్నట్టు ఇండియా, పాకిస్తాన్ నేతలు ఇలా పంచ్ డైలాగులు విసురుకుంటారు. కానీ యుద్ధం చేయరు. ఎందుకంటే ఇద్దరికీ అణ్వాయుధాలు ఉన్నాయి. తాము అమ్మిన ఆయుధాలతో యుద్ధం అంటే అమెరికా ఓకే అంటుంది. కానీ రెండు దేశాలు సొంతంగా తయారు చేసుకున్న అణ్వాయుధాలతో యుద్ధం అంటే ఒప్పుకోనే ఒప్పుకోదు.’’
‘‘మరింకెందుకు దిగులు?’’
‘‘120 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో వంద మంది ప్రతినిధులు ఒలింపిక్స్‌లో పాల్గొని కనీసం ఒక్క బంగారు పతకం అన్నా తేలేదు అంటే ఈ దేశం ఏమవుతోంది అని ఆలోచిస్తేనే ఆందోళనతో నిద్ర రావడం లేదు’’
‘‘అది సరే కంగ్రాట్స్ తండ్రివి అయ్యావని తెలిసింది. పిల్లాడి గురించి ఏమాలోచిస్తున్నావ్’’
‘‘నేను ఆలోచించక ముందే మా ఆవిడ పురిటి నొప్పులు పడుతుందని తెలిసి ఆస్పత్రిలోనే చై.నా విద్యా సంస్థ ప్రతినిధి వచ్చి ఆవిడకు బ్రెయిన్ వాష్ చేసి వెళ్లాడు. పిల్ల పుట్టిందని తెలియగానే హిజ్రాలు ఎలా వాలిపోతారా?అని ఎంత కాలం నుంచి ఆలోచించినా సమాధానం దొరక లేదు. దానికి తోడు ఇప్పుడు వీళ్లు... పుట్టబోయే బిడ్డ తెలివైన వాడని గ్రహించి 50 శాతం ఫీజు రాయితీ ఇస్తానని చెప్పాడు. బిడ్డ పుట్టాక మూడు నెలలు చై.నా. ప్రతినిధుల పర్యవేక్షణలో తల్లి వద్ద బిడ్డ ఉంటుంది. పాలు మరిచాక వారికి పూర్తిగా అప్పగించాలి. ఐఐటి వరకు కోచింగ్ పూర్తయ్యే వరకు వారి వద్దే ఉండాలి. పసుపు కుంకుమల కింద వాళ్ల నాన్న ఇచ్చిన పొలం అమ్మి పుట్టబోయే బిడ్డను ఐఐటి కోచింగ్‌లో చేర్పించింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మా బిడ్డ గురించి ఇప్పుడు నాకెలాంటి దిగులు లేదు. గుండెల మీద చెయి వేసుకొని పడుకోవచ్చు. చై.నా ఉంది నా చెంత.. దిగులు లేదు నాకు కొంత కూడా.. ’’


‘‘మరి పిల్లాడితో ముద్దు ముచ్చట ఏమీ ఉండదా? పుట్టక ముందే చై.నాకు అప్పగిస్తున్నారనే కోపంతోనేమో, ఉద్యోగం రాగానే వాళ్లు పెద్దవారిని వృద్ధాశ్రమాలకు పంపి కసి తీర్చుకుంటున్నారు ’’
‘‘వాడి దిగులు లేదు కాబట్టి ఈ దేశం ఏమవుతుంది అనే నా దిగులంతా’’
‘‘వాడికి ఐఐటిలో సీటు రాలేదనుకో మరి అప్పుడు?’’
‘‘శుభం పలకరా అంటే ఈ అపశకునం మాటలెందుకు? కానీ.. 120 కోట్ల మంది జనాభాలో ఒక్క బంగారు పతకం కూడా రాకపోవడం..రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణం. మనకు ప్రజాస్వామ్యం పనికి రాదు. మిలట్రీ పాలన ఉంటే కనీసం 50 బంగారు పతకాలు వచ్చేవి.’’
‘‘పాకిస్తాన్‌లో చాలా కాలం సైనిక పాలనే ఉంది కదా? వారికి రాలేదేం?’’


‘‘పాకిస్తాన్ సంగతి వేరు. మన సంగతి వేరు. స్వయం కృషితో మనం తీసుకున్న లంచాల్లో ఇంకొకడికి వాటా ఎందుకివ్వాలి. ఎవడి లంచం వాడికే సొంతం అని చట్టం తేవాలి. లంచంలో 50శాతం వాటా తనకే అని బాస్ వేధిస్తున్నాడు. అసలు మనిషన్నాక విలువలు ఉండాలి. ఇవన్నీ వదిలేయ్ బంగారు పతకం రాకపోవడం బాధే కదా? ’’
‘‘ అంటే ఇప్పుడు మన దేశానికి బంగారు పతకం రాకపోతే ఏమవుతుందంటావు? బ్రిటీష్ వాడు మన కిచ్చిన స్వాతంత్య్రాన్ని వెనక్కి తీసుకుంటాడా? అమెరికా వాడు అప్పు ఇవ్వడా? రూపాయి విలువ మరింతగా పడిపోతుందా? మోదీ ప్రభుత్వం కూలుతుందా? కెసిఆర్ బాబులు దిగిపోతారా? ఐఎస్ ఉగ్రవాదులు మరింతగా విజృంభిస్తారా? ఏమవుతుంది? 120 కోట్లలో 60 కోట్ల మందికి పుష్టికరమైన ఆహారమే లేదు. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న గ్రామాలకు కూడా ఇంకా విద్యుత్ లేదట! ఇక దేశంలో విద్యుత్ తెలియని గ్రామాలు వేలలో ఉన్నాయి. కొన్ని కోట్ల మందికి మంచినీళ్లు కూడా విలాస వస్తువే. వీటి గురించి ఆలోచించి దిగులు పడుతున్నావ్ అనుకున్నాను.’’


‘‘చీ..చీ.. క్రీడా ద్రోహి..దేశానికి బంగారు పతకం రాలేదని బాధపడని నువ్వేం మనిషివి? నీలో దేశభక్తి లేదా?’’
‘‘నాలో దేశభక్తి పర్సంటేజ్ తక్కువే. మా కాలంలో క్రీడలు అంటే చూసేవి కాదు ఆడేవి. స్కూల్‌లో ప్రత్యేకంగా ఆటలకు ఒక పిరియడ్ ఉండేది. ఇప్పుడు తెలుగు నాట పుట్టక ముందే చైనా పిల్లలను కబళించేస్తోంది. పుచ్చకాయలు గుండ్రంగా ఉంటే రవాణాలో స్థలం ఎక్కువ తీసుకుంటుంది అని చైనాలో ఆ మధ్య చతురస్రాకారం పుచ్చకాయలను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టారు. చైనా పుచ్చకాయలను చతురస్రాకారంగా మారిస్తే మన చై.నా. పిల్లల మెదళ్లను ఎంసెట్, ఐఐటి ఆకారంలోకి మారుస్తున్నారు. ’’


‘‘చక్కని చదువు చెప్పడం కూడా తప్పేనా?’’
‘‘ జైలుగోడల్లో శిక్షణ లేని కాలంలో కూడా ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. ఇప్పుడూ అవుతున్నారు. ఆట పాటలు కాదు.. అసలు బాల్యనే్న మాయం చేస్తున్నారు. బంగారు పతకం కాకపోయినా చిన్నప్పుడు ఆట పాటలతో పెరిగితే ఎంతో కొంత ఆరోగ్యం ఉంటుంది. చీకటి గదుల్లో పెరిగే తరానికి క్రీడలు అంటేనే ఏమిటో తెలియనప్పుడు ఇక బంగారు పతకాలు ఆశించడం అత్యాశే.’’


‘‘ఎంసెట్,ఐఐటి ఎంట్రెన్స్‌లో క్రీడలను భాగం చేస్తే, ?’’
‘‘అదే జరిగితే.. పేపర్ లీకేజీలు... టాప్ క్రీడాకారులను ముందే కొనేసి ఒలింపిక్స్‌ను కూడా హస్తగతం చేసుకోగలరు’’

జనాంతికం - బుద్దా మురళి 21 .9.2016

14, ఆగస్టు 2016, ఆదివారం

నయీ మిజం వర్థిల్లాలి

‘‘తాతా ఓ కథ చెప్పవా?’’
‘‘నా పోలీసు జీవితంలో నేను పాల్గొన్న సాహస కథ చెబుతా! ఆ ఆపరేషన్‌లో ప్రాణాలతో బయటపడింది నేనొక్కడినే’’
‘‘చెప్పు తాతా’’
‘‘న
యీమ్ అని మా కాలంలో నరరూప రాక్షసుడు. భూమిని చుట్ట చుట్టి తన జేబులో పెట్టుకున్న భయంకర రాక్షసుడు. అరాచకాలు మితిమీరిపోవడంతో పోలీసు అధికారులు ఇండియన్ పీనల్ కోడ్ పుస్తకాలను ముందేసుకుని కూర్చున్నారు.’’

‘‘మక్కెలిరగ్గొట్టి స్టేషన్‌లో పడేయాలి కానీ ఐపిసి చదవడమేంటి? కామెడీ కథ చెబుతున్నావు. ఇన్ని వేల మంది పోలీసులు, ప్రభుత్వాలు ఉండగా, ఒక్కడు అరాచకాలు ఎలా చేస్తాడు?వాడేమన్నా సూపర్ మ్యానా? స్పైడర్ మ్యానా? తప్పించుకొనేందుకు?’’
‘‘పోలీసులు, ప్రభుత్వాల మద్దతు లేనిదే వాడు అరాచకాలు చేశాడని నేను చెప్పానా? వారి సంపూర్ణ మద్దతుతోనే చేశాడు. చెప్పింది విను’’
‘‘పోలీసులు, ప్రభుత్వమే కోన్‌కిస్కాగాడు చెలరేగిపోతే వౌనంగా ఉంటే, చిన్న పిల్లాడిని ఊ కొడుతూ వౌనంగా వినలేనా? చెప్పు’’
‘‘ప్రభుత్వం మారింది, ప్రియారిటీలు మారాయి. దాంతో పోలీసు అధికారులు ఐపిసి పుస్తకాలతో కుస్తీ పట్టి 356 పేజీల నోటీసు తయారు చేశారు. దానికి భారత రాజ్యాంగాన్ని ఇరుగు పొరుగు రాష్ట్రాల చట్టాలను జత చేసి ట్రాలీలో న
యీ మ్ ఇంటికి పంపించారు.

కాలింగ్ బెల్ సౌండ్ విని నయీమ్ అంగరక్షకురాలు కిటికీలోంచి చూసిం ది పెద్ద సంఖ్యలో పోలీసులు కనిపించడంతో లోపలకు వెళ్లి కరెన్సీ నోట్ల కట్టలు తెచ్చి ఒక్కోక్కరిని వరుసలో నిలబడమంది. మేం పాత పోలీసులం కాదు. నయీమ్ చేస్తున్న పని నేర పూరితమైనది. సెక్షన్ 349/ 10 +3 డివైడెడ్ బై 2 ఇంటూ 4 మైనస్ 2, 1958లో సవరించిన చట్టం 1456 - 5 ప్రకారం నయీ మ్ పలు నేరాలకు పాల్పడ్డాడు...లొంగిపో.... అని మా పోలీసు ఇంకా సెక్షన్‌లను చెప్పడం పూర్తి కాక ముందే నయీమ్ అంగరక్షకురాలు పేల్చిన తూటాకు ఆ పోలీసు నేలకొరిగాడు. దాంతో పక్కనున్న మరో పోలీసు సెక్షన్లను చదవడం పూర్తి చేశాడు. అంగరక్షకురాలు ముందు వరుసలో ఉన్న ఆరుగురికి ముగింపు పలికింది. ఆరేడు డజన్ల మంది పోలీసులను దశల వారిగా పంపించారు. తూటాల శబ్దానికి న రుూమ్‌కు మెళకువ వచ్చి చిరాకేసి ఎకె 47 తీసుకుని అందరినీ ఒకేసారి వేసేశాడు. పోలీసులు ఎంతో కష్టపడి తయారు చేసిన నోటీసును కనీసం చదవకూడా చదవలేదు.

చాలా దూరంలో ఒక వ్యాన్‌ను ఆపి హ్యాండ్ మైక్‌తో నేను ఎప్పటికప్పు డు సెక్షన్లను చదువుతూ మా పోలీసు అధికారులకు చెబుతుండాలి అందుకే నేను ఐపిసి పుస్తకాల మధ్య సురక్షితంగా ఉండిపోయాను. అవన్నీ పనికిరాని పుస్తకాలు అనుకుని నయీ మ్ బృందం నన్ను చూడకుండా వదిలేసింది. ఐపిసి పుస్తకాలు నన్ను అలా తమ కడుపులో దాచుకున్నాయి. అందుకే అవంటే నాకు అంత గౌరవం.
పోలీసులు అందరూ పోవడంతో కొత్తగా పోలీసులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మంత్రివర్గంలో నిర్ణయించి, అసెంబ్లీలో చర్చించి చివరకు మరింత మంది పోలీసులు అవసరం అనే నిర్ణయానికి వచ్చారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా నియామకాలు జరపాలా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలా? అని చాలా ఏళ్లపాటు చర్చలు జరిగాయి. ఇతరులపై పోలీసులు పెత్తనం చేయాలి కానీ పోలీసులపై ఇతరుల పెత్తనాన్ని ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పడంతో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారానే నియమించాలని నిర్ణయించారు. అంతా అయిపోయాక రిజర్వేషన్లలో పాయింట్ 2% లెక్కల్లో తేడా వచ్చిందని, తనకు రావాలసిన ఉద్యోగం మరొకరికి వచ్చిందని ఒక అభ్యర్థి హైకోర్టుకు వెళ్లాడు. 10ఏళ్లకు తీర్పు వచ్చింది. ఆ తీర్పు నచ్చక మరో అభ్యర్థి సుప్రీంకోర్టుకు వెళ్లాడు. తీర్పు ఏదో ఒకనాడు వచ్చి తీరుతుంది. ’’


‘‘తరువాతేమైంది తాతయ్య?’’
‘‘మా పోలీసుల్లో చాలా మంది ఇలా నేలకొరిగిపోవడంతో ఎస్‌ఐగా ఉద్యోగంలో చేరిన నేను ఎస్‌పిగా రిటైర్ అయ్యాను. న
యీ మ్ కార్పొరేషన్ అని సినిమా కంపెనీని స్థాపించి నయీమ్ ఎన్నో సందేశాత్మక సినిమాలు తీశాడు. వాడి మనవళ్లలో చాలా మంది భారతీయ సినిమాల్లో అనేక భాషల్లో హీరోలు. నయీమ్ దుబాయ్ కేంద్రంగా అనేక దేశాల్లో తన బ్రాంచిలు ఏర్పాటు చేసి సత్వర న్యాయం స్కీమ్‌ను అమలు చేస్తున్నాడు. చానల్స్‌లో నైతిక విలువలు బోధిస్తున్నాడు. పోలీసు నియామకాల కేసు కూడా నయీ మ్‌కు అప్పగిస్తారంటున్నారు. నయీ మ్ భక్త పోలీసు అధికారులు రిటైర్ అయ్యాక, రియల్ ఎస్టేట్‌లో, రాజకీయాల్లో శేష జీవితాన్ని గడుపుతున్నారు. నయీ మ్ స్వదేశానికి వచ్చి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఇంత కాలం తనను ఆదరించిన మాతృదేశం రుణం తీర్చుకోవాలనుకున్నాడు. విషయం తెలిసిన దేశ ప్రజలు నయీ మిజం వర్థిల్లాలి.. నయీ మిజం వర్థిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ..’’
***
‘‘ఎంత ఆదివారం అయినా బారెడు పొద్దేక్కే దాక పడుకుని ఏంటా కలవరింతలు న
యీ మిజం వర్థిల్లడమేంటి లేచి తగలడండి’’
‘‘ నాకేమీ పిచ్చెక్కలేదు. ఇలాకల కన్నాను ’’
‘‘ఏడ్చినట్టే ఉంది మీ కల? ఆ మేధావుల టీవి చర్చలు చూడకండి అని చెబితే వినరు. వాళ్ల మాటలు విని చట్టాల పుస్తకాలు పట్టుకుని న
యీ మ్‌ను పట్టుకోవడానికి వెళ్లి ఉంటే నిజంగా మీరు కల కన్నట్టే జరిగేది. మనసుండాలి కానీ దుష్టశిక్షణ అసాధ్యమా? పగలు, రాత్రి, ఇంట్లో బయట మరణం వద్దనుకున్న హిరణ్యక్షుడు.. తన చేతిలోనే తన మరణం కోరుకున్న భస్మాసురుడు, కడుపులోనే మరణ రహసాన్ని దాచుకున్న రావణుడు, శాశ్వతంగా ఉండేట్టు వరాలు పొందిన ఎంతో మంది రాక్షసులకు మరణం తప్పలేదు. ఎన్ని చావు తెలివి తేటలతో వరాలు పొందినా చావు తప్పదు.’’
‘‘నాకో ధర్మసందేహం ’’
‘‘న
యీ మ్ మరణం ధర్మ బద్ధమా? చట్టబద్ధమా?’’
‘‘రెండూ కలిసే ఉంటాయి. నేనూ ఓ ప్రశ్న అడుగుతాను. వాడి పీడా విరగడ కావడం బాగుందా? లేక మీరు కల కన్నట్టు జరగడం మంచిదా?’’    

7, ఆగస్టు 2016, ఆదివారం

సినిమా చూపిస్త మామా!

‘‘సినిమా చూపిస్త మామా! నీకు సినిమా చూపిస్త మామా! సీను సీనుకూ నీతో సీటీ కొట్టిస్త మామా’’
‘‘చూపిస్తా చూపిస్తా అనడమే కానీ ఒక్క సినిమా ఐనా చూపించావా?’’
‘‘మనం చూడాలనుకున్న సినిమాకు టికెట్లు దొరకవు, టికెట్లు దొరికిన సినిమాకు లీవు దొరకదు. రెండూ కుదిరితే సినిమా బాగోదు జీవితం ఇంతే. ఐనా నేను పాడింది నీకు చూపించే సినిమా గురించి కాదు.. మోదీ చూడబోయే సినిమా గురించి’’
‘‘మోదీకి మీ బాస్ సినిమా చూపిస్తాడా? మీ బాస్‌కు మోదీ సినిమా చూపిస్తున్నాడా? నిజం చెప్పు.’’


‘‘అది వదిలేయ్! మా బాలయ్య బాబుకు కోపం వచ్చింది. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వక పోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. బాలయ్య బాబు హెచ్చరించాడంటే బ్రహ్మాస్త్రం ప్రయోగించే ముందు లాంటి హెచ్చరిక అన్నమాట. పాశుపతాస్త్రానికి బాలయ్య బాబు రంగంలోకి దిగడానికి పెద్ద తేడా ఉండదు. ఆరోజు గుర్తుందా? లక్ష్మీపార్వతి సమేత ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్‌కు చైతన్య రథంపై వస్తే అభిమానులు చెప్పులు విసిరేస్తే, బాలకృష్ణ అభిమానులు అప్పుడే విడుదలైన సినిమా పోస్టర్లను చూపించి మాతో పెట్టుకోకు అని హెచ్చరించారు. పోస్టర్ చూసి ఎన్టీఆర్ సైతం వెనక్కి తగ్గక తప్పలేదు’’
‘‘ఎందుకు గుర్తు లేదు. ఆ సినిమా తుస్సుమంది కానీ సినిమా పోస్టర్ మా త్రం చరిత్రలో నిలిచిపోయింది’’
‘‘అదే చెబుతున్నాను అలుగుటయే యెరుంగని బాబు అలిగితే ఏమవుతుందో ఒక ఎంపి చెప్పనే చెప్పాడు. అలానే బాలయ్యకే కనుక కోపం వస్తే 101వ సినిమాతో మోదీ పని ఐపోయినట్టే.’’
‘‘ చంద్రమండలంపై తొలిసారి అడుగు పెట్టిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు ఇడ్లీ ఇడ్లీ అని స్వాగతం పలికాడట తమిళ తంబి. దానికి పొడిగింపు తెలుసా? ఆ తమిళ తంబికి హోల్‌సేల్‌గా ఇడ్లీ రవ్వ, మినప్పప్పు సప్లై చేసేదే గుజరాతీ వ్యాపారి. అలాంటి గుజరాతీ వ్యాపారి ముందా నీ బిజినెస్ తెలివి తేటలు. సంకీర్ణ ప్రభుత్వం వస్తే చక్రం తిప్పాలనుకుని కలలు కన్నారేమో.. మూడు దశాబ్దాల తరువాత సొంత బలంతో అధికారంలోకి వచ్చిన గుజరాతీ వ్యాపారికి సినిమా చూపించాలని నువ్వు ఆలోచన చేసే ముందే నీకు సినిమా చూపిస్తాడతను. ఐనా ఆయనేమన్నా ఎన్టీఆర్ అనుకున్నావా? వార్తలతో అధికా రం నుంచి దించేయడానికి, సామాజిక మాధ్యమాలను నమ్ముకుని అధికారంలోకి వచ్చిన మోదీ.’’
‘‘గుజరాత్ ఏంటి? ప్రపంచాన్ని చుట్టి వచ్చిన బాలయ్య బాబు ఒక్క సినిమా తీశాడంటే మోదీ గింగిరాలు తిరిగి కాళ్ల బేరానికి రావలసిందే’’


‘‘ఔను చంద్రోదయం అని బాబు పాలనపై ఏదో సినిమా తీస్తున్నారట! కథేంటో? గ్రాఫిక్ సినిమానా? కుటుంబ కథా చిత్రమా? రాజకీయ కథనా? క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లరా?’’
‘‘నీకు తెలియక కాదు నాతో చెప్పించాలని అడుగుతున్నావ్! సినిమాకు కథతో ఏం పని? ఈ మధ్య వస్తున్నవన్నీ కథలేని సినిమాలే కదా? ఐతే ఇలాం టి సినిమా ప్రకటనల వెనుక తప్పకుండా ఆసక్తికరమైన కథ ఉంటుంది? వైఎస్‌ఆర్‌పై తాను సినిమా తీస్తున్నట్టు పూరీ జగన్నాథ్ ప్రకటించారు. సినిమా ఏమైందో? సినిమా ప్రకటన వెనుక కథ ఏమైందో తెలియదు. ’’
‘‘అంటే ఇవన్నీ ఉట్టుట్టి కథలేనా? ’’


‘‘కొన్ని ప్రాజెక్టులు వర్కవుట్ అయినప్పుడు సినిమాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు చాలా సినిమాల్లో బాబు పథకాలను చూపించేవారు. సుమన్ హీరోగా జన్మభూమిపై ఓ సినిమా వచ్చింది. విడుదలైందో లేదో కానీ సినిమా షూటింగ్ మాత్రం జరిగింది. ఏ కథ వెనుక ఏ ప్రాజెక్టు ఉందో ఎవరికి తెలుసు’’
‘‘ఆ మధ్య కెసిఆర్ మీద ఓ సినిమా తీస్తారని వార్తలొచ్చాయి. ఎంత వరకు వచ్చిందో?’’
‘‘ప్రాజెక్టా? సినిమానా ఎంత వరకు వచ్చింది అని అడుగుతున్నది దేని గురించి? ఓసారి బాలకృష్ణ కెసిఆర్‌ను కలిసి డిక్టేటర్ సినిమా చూసేందుకు రావాలని పిలిస్తే, తెలంగాణ వాదులు కెసిఆర్‌పై ఇదో రకమైన కుట్ర అన్నారు. ఎంతైనా తెలంగాణ నేతలకు సినిమా రుచి తక్కువే? లేకపోతే ఉద్యమ కాలంలో కలిసి ఉంటే కలదు సుఖం అనే కానె్సప్ట్‌తో నాలుగైదు సినిమాలు తీస్తే సరిపోయేది.’’
‘‘ఏంటీ నాలుగైదు సినిమాలకు అంత పవర్ ఉంటుందా? ’’
‘‘ఎందుకుండదు? 83లో ఎన్టీఆర్ గెలవడానికి 82 నుంచి ఏడాది కాలం పాటు వచ్చిన ఈనాడు, బెబ్బులిపులి వంటి సినిమాలు బాగా ఉపయోగపడ్డ విషయం తెలిసిందే కదా? కాలం కలిసిరానప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర కూడా 89లో ఎన్టీఆర్‌ను ఆదుకోలేక పోయిందనుకో. అలానే చిరంజీవిని కూడా ఆయన సినిమాలు ఆదుకోలేకపోయాయి.’’


‘‘కబాలి సినిమా దళిత చైతన్యంతో నిర్మించడం వల్లనే ఫెయిల్ అయిందని కొందరి వాదనట కదా?’’
‘‘కథేంటో? ఎందుకు ఆడలేదో తెలియదు. కానీ ప్రతి సినిమాలోనూ ఆ సమాజంలో ఆధిపత్యం చెలాయిస్తున్న వారి కథ అంతర్లీనంగా ఉంటుంది. గుండమ్మ కథ సినిమా ప్రివ్యూ చూసి ఒక సామాజిక వర్గం ఇళ్లలో కనిపించే సామాన్య విషయం.. ఇందులో గొప్ప కథేముంది? అని తమ ఇంట్లో జరిగిన పంక్షన్‌లో ఆసినిమా ప్రివ్యూ చూసి అప్పటి అగ్ర దర్శకులైన ఓ రెడ్డిగారు పెదవి విరిచారట! ఇంకా ముందుకు వెళితే మన సినిమాల్లో జమిందార్లు పేద ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటారు. జమిందారు రెండవ భార్య తమ్ముడో, దూరపు బంధువో, మేనేజరో విలన్ అయి ఉంటారు. ఎందుకంటే ఆనాటి సినిమా నిర్మాతలు, చాలా చోట్ల థియోటర్ల ఓనర్లు జమిందార్లే. ఎవరు పెట్టుబడి పెడుతున్నారో వారిని విలన్లుగా చూపిస్తూ కథెందుకు రాస్తారు? రాసినా తీసేవారెవరు? ’’
‘‘ అసలు బాలయ్యపై మొదటి నుంచి కుట్ర జరుగుతోంది’’
‘‘రెండు దశాబ్దాల క్రితం బాలయ్యనే నా వారసుడు అని ఎన్టీఆర్ మదనపల్లిలో చేసిన ప్రకటన గురించా?’’


‘‘అది కాదు.సార్వభౌమాధికారం అనే మాట ప్రమాణ పత్రంలో చేర్చడమే పెద్ద కుట్ర ఈ ఒక్క పదం లేకపోతే బాలకృష్ణ ఎప్పుడో సిఎం అయ్యేవారని నా గట్టి నమ్మకం.’’ ...
 బుద్ధా మురళి 

జనాంతికం