9, అక్టోబర్ 2013, బుధవారం

పోకిరీ విద్యార్థులు - మహా నేతలు

ఏమండోయ్ మీ శిష్య పరమాణువులు టీవిలో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు వింటారా? అని భార్య గాయత్రి పిలవడంతో సుందరం పరిగెత్తుకొచ్చాడు. టీవిలు సగం స్కీృన్‌ను బా బుకు, మరో సగం జగన్‌కు అంకితం చేశాయ. టీవిలో జగన్,చంద్రబాబులు తప్ప ఎవరూ కనిపించడం లేదు కదా? అని గాయత్రిని తండ్రి అడిగాడు. వాళ్లిద్దరే మీ అల్లుడి గారి శిష్యులు అంది గాయత్రి నవ్వుతూ. 

నాలుగు పదుల వయసున్న అల్లుడి గారికి ఆరుపదుల వయసు దాటిన చంద్రబాబు, నాలుగుపదుల వయసు న్న జగన్ శిష్యుడేమిటో అస్సలు అర్ధం కాలేదు.

కొద్దిసేపటి తరువాత విషయం అర్ధమైన సుందరం ఉడుక్కున్నాడు. చాల్లే బడాయి. నా శిష్యులు మరీ ఇలా ఏమీ కాదు. ప్రతి వారికి ఏదో ఒక బలహీనత ఉన్నట్టు, ప్రతి విద్యార్థికి ఏదో ఒక సబ్జెక్ట్‌లో బలహీనంగా ఉంటాడు. మరీ వీరిలా ఏమీ కాదు అని చెప్పాడు. మామ గారు విషయం అర్ధం కావాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి అని సుందరం చెబుతుండగానే సినిమాల్లోలా రింగులు రింగులుగా పొగ కనిపించసాగింది...

***
సుందరం ముఖ కవళికలు క్షణానికో విధంగా మారిపోసాగాయి. ఏమైందండి అంటూ భార్య కంగారుగా అడిగింది. చూడవే ఈ వెధవలు అడిగిన ప్రశ్నకు సమాధానం తప్ప అన్నీ రాశారు.
వీడేం రాశాడో చదువుతా విను అంటూ చదవసాగాడు.
ప్రశ్న: రాష్టప్రతి అధికారాలు, విధులు వివరింపుము- పది మార్కులు
జవాబు: దేశానికో రాష్టప్రతి ఉంటాడు. రాష్టప్రతి కూడా మనిషే అందరు మనుషుల్లానే ఆయనకూ  కోరికలు ఉంటాయి. రాష్టప్రతికి పోకిరీ సినిమా చూడలనిపించింది. సినిమా హాలుకు వెళ్లి పోకిరీ చూశాడు. హీరో మహేష్‌బాబు, హీరోయిన్ ఇలియానా... ఇక కథ విషయానికి వస్తే....
ఇక చాల్లేండి అని గాయత్రి నవ్వింది. ఇంకో ఆన్సర్‌షీటు చదువుతానుండు అంటూ సుందరం మరోటి తీసుకున్నాడు.
ప్రశ్న: మంత్రిమండలి బాధ్యతలు వివరింపుడు- పది మార్కులు
జవాబు: సార్ మీ చల్లని దీవెనలు నాకుండాలి. నిన్ననే మీ పేరుమీద మీ భార్య, పిల్లల పేర్లమీద మా ఊరి ఆంజేయస్వామి గుడిలో పూజలు చేయించాను. మీరు నన్ను పాస్ చేస్తారని మొక్కుకున్నాను. ఆ దేవుడి అనుగ్రహం ఎలా ఉంటుందో? ఆగ్రహం కూడా అలానే ఉంటుంది సార్. వీడెవడో సున్నితంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడండీ అంది గాయత్రి
***
అందరూ ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చి నవ్వుకున్నారు.
టీవి చూస్తే ‘ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించమని ఆరోజు నేనే చెప్పాను, నిన్న సమన్యాయం అని అడిగింది నేనే. ఇప్పుడు మళ్లీ నేనే చెబుతున్నాను సమైక్యాంధ్ర అంటున్నాను అని అతను సాగదీస్తూ చెప్పాడు. తాతయ్య ఇంట్లోకి అడుగుపెడుతూ కళ్లద్దాలు సవరించుకుంటూ ఎవర్రా శివారెడ్డేనా అచ్చం వైఎస్‌ఆర్‌లానే మిమి క్రీ బాగా చేస్తున్నాడు అని మెచ్చుకున్నాడు. 
అది మిమిక్రి కాదు ఆయన శివారెడ్డి కాడు .అయన జగన్ రెడ్డి . అచ్చం తండ్రి లా మాట్లాడాలని అలా సాగదీస్తూ మాట్లాడుతున్నాడని చెప్పారు.
 ఇంతకూ  సమన్యాయం అంటే ఏమిటి ? ఎలా సాధించాలి అని ఒక విలేఖరి అడిగాడు . 
తెలుగు మీడియా అంటే అందుకే నాకు చిరాకు .. జాతీయ మీడియా తోనే మాట్లాడుతాను . అని జగన్ కోపంగా చెప్పాడు 
, ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ , ఎకనామిక్ టైమ్స్ తో  సహా నా గురించి ఎంత బాగా రాస్తారు .. 
రాజకీయం ఎంత వ్యాపారం అయినా .. మరీ  వ్యాపార పత్రికలకే పరిమితం కావద్దు అంటూ తెలుగు పత్రికలను పిలిచారు అంటూ జగన్‌రెడ్డి  అసహనం వ్యక్తం చేశాడు 

మరోటీవిలో చంద్రబాబు ఢిల్లీ విలేఖరుల సమావేశం వస్తోంది.
ఇంతకూ మీరు తెలంగాణ ఇవ్వాలంటున్నారా? వద్దంటున్నారా? ఢిల్లీ విలేఖరి సూటిగా అడిగారు.
బాబు కోపంగా తాజ్‌మహల్ నిర్మాణానికిరాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు ? ఎన్ని తెచ్చారు ? బ్రదర్ చెప్పు అని విలేఖరిని నిలదీశాడు.
నా ప్రశ్నకు దీనికి సంబంధం ఏమిటని ఆ విలేఖరి బిక్కచచ్చిపోయాడు.
అదే చెబుతున్నాను బ్రదర్ ఢిల్లీ పక్కన ఉన్న తాజ్‌మహల్ గురించే నీకు తెలియనప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఎలా అడుగుతావుఅని నిలదీశాడు.
సరే సార్ నేను ఆంధ్రప్రదేశ్ వాడినే. అదే ప్రశ్న నేను అడుగుతున్నాను చెప్పండి అని తెలుగు విలేఖరి ముందుకు వచ్చాడు.
రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండమన్నారు, ఇండియాలో ఉన్నప్పుడు సోనియాగాంధీ ఇండియన్‌లా ఉండాలి ఔనా కాదా ముందు మీరు చెప్పండి అని బాబు గద్దించాడు.
ఔను ఉండాలి అని అంతా పలికారు.

ఆ విషయం చెప్పడానికి మీరెవరు? సోనియాగాంధీ ఇక్కడికొచ్చి చెప్పాలి అప్పటి వరకు కదిలేది లేదని అన్నారు.
సరే సార్ ఇంతకూ మీరు రాష్ట్ర విభజన జరగాలంటున్నారా? వద్దని చెబుతున్నారా?
జరగాలనడానికి నేనెవరు, వద్దనడానికి మీరెవరు? చేసేది చేయించేది అంతా ఆ పైవాడే.
నేను ధర్మం కోసం వచ్చాను. ఎక్కడ ధర్మం అమ్ముతుంటే అక్కడ కొనుక్కునే సత్తా నాకుంది. అని ఆవేశంగా పలికాడు.
తెలంగాణ ఏర్పాటు చేయాలంటారా? వద్దంటారా? ఒక్క మాట చెప్పండి సార్ వెళ్లిపోతాం అని వేడుకున్నారు. బ్రదర్ గంట క్రితం ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు బ్రతిమిలాడుకుంటున్నారు. తెలుగోడి దెబ్బ తెలిసొచ్చిందా అని అడిగాడు. అలూ లేకుండా సమోసా చేయాలని చూస్తే దెబ్బతినడం ఖాయం ఆ విషయమే సోనియా కు చెప్పడానికే ఢిల్లీకి వచ్చానని బాబు చెప్పాడు. ధర్మో రక్షిత రక్షితః అన్నారు.కంటి చూపుతో కాదు ఉపన్యాసంతో చెవుల నుంచి రక్తం కారేట్టు చేస్తాను.. తెలుగు పౌరుషం అంటే ఏమనుకుంటున్నారు అని చంద్రబాబు  వార్నింగ్ ఇచ్చాడు. 
*****
వీరు సుందరానికి శిష్యులు ఎలా అవుతారో అందరికీ అర్ధం అయి నవ్వుకున్నాడు.
నీతి: విలేఖరుల ప్రశ్నల్లో మార్పు ఉండొచ్చు కానీ చంద్రబాబు చెప్పదలుచుకున్నసమాధానంలో ఎలాంటి మార్పు ఉండదు.

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం