4, జనవరి 2012, బుధవారం

నిజం చెప్పవద్దు.. అబద్దమాడవద్దు .. నాకు నచ్చిన news


.
ఇది చాల కష్టమైన పని నిజం చెప్పవద్దు అలా అని అబద్దమాడవద్దు . ఇలంట వార్త రాయాలంటే కత్తిమీద సాములాంటిదే.  భాషలో, విషయం లో పట్టు ఉంటేనే అది సాధ్యం. ఈనాడులో ఈరోజు వచ్చిన వార్త నాకు తెగ నచ్చేసింది . ఆస్తులు అమ్ముకున్నవాడు అమ్ముకున్నాము అని చెబుతాడు ఇది అందరు చేసే పని కానీ మహానుబావులు అలా చెప్పరు. ఈటివి వారు తెలుగు చానల్స్ మినహా మిగిలిన చానల్స్ అన్ని అమ్ముకున్నారు. మార్గదర్శి ఆధ్వర్యం లో చట్టవ్యతిరేకంగా డిపాసిట్లు వసూలు చేస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ బయట పెట్టిన తరువాత చాల రోజుల నుండి చానల్స్ అమ్మేస్తున్నరనే వార్తలు పలు జాతీయ పత్రికల్లో వచ్చాయి. ఇప్పుడది అధికారికంగా వెల్లడయింది . అన్ని పత్రికలూ రామోజీ చానల్స్ అమ్మేశారని వార్త రాస్తే ఈనాడులో మాత్రం ౧౦౦ శతం వాటాల మార్పిడి అని చాల తెలివిగా అబద్దం చెప్పకుండా నిజం అర్ధం కాకుండా భలే రాశారు . రాజుగారికి అశుభ వార్త చెబితే కోపం వస్తుంది అందుకే  మీ గుర్రం చచ్చింది అని చెప్పడానికి మీ గుర్రం మొండెం తల నుండి వేరయింది మహారాజ అంటూ ఏదో చెప్పాడని కథ . చానల్స్ అమ్మేసిన వార్త ఈనాడులో ఎలా ఉందో, ఇతర పత్రికల్లో ఎలా ఉందో చూడండి .   జుట్టు ఉన్న ఆవిడ ఏ కొప్పు అయిన వేయగాలదన్నట్టు బాషలో పట్టున్న వారు ఏ విషయమైన ఎలా గైనా రాయగలరు . http://www.eenadu.net/Business/Businessinner.aspx?qry=bussi2

2 కామెంట్‌లు:

  1. telugu channels rendintilo 24.5 per cent vaataa matrame vikrayincharu.

    రిప్లయితొలగించండి
  2. అవునండి పురాణ పండ గారు అందుకే తెలుగు మినహా మిగిలిన చానల్స్ అమ్మేశారు అని రాశాను దీనికి ఈనాడులో వంద శాతం వాటాల బదిలీ అని రాశారు

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం